కాగజ్నగర్టౌన్ : ఆసిఫాబాద్ జిల్లాలో శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గామాత రోజుకో మాదిరిగా దర్శనం ఇస్తుండడంతో దానికి అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం 4వ రోజు వివిధ అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని కాగజ్నగర్ పట్టణంలో అమ్మవారు శ్రీమహాలక్ష్మి దేవీ అవతారంలో దర్శనమిచ్చింది.
ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ కమిటీ నిర్వాహకులు రూ. 15లక్షల 16వేల కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు, ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.