బెంగళూరు: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు వదిలేయడంతో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ఫాఫ్ డుప్లెసిస్కు పగ్గాలు అప్పగించింది. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్.. ఆర్సీబీని ముందుకు నడిపించనున్నాడు. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టిన డుప్లెసిస్ను మెగావేలంలో ఆర్సీబీ రూ.7 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ‘ఈ అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. మా జట్టులో గొప్ప నాయకుడు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉన్నాడు’ అని డుప్లెసిస్ పేర్కొన్నాడు. రెండేండ్ల క్రితం అన్నీ ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన డుప్లెసిస్.. ఐపీఎల్లో 100 మ్యాచ్లాడి 131 స్ట్రయిక్ రేట్తో 2935 పరుగులు చేశాడు.