హైదరాబాద్ : కృష్ణా ఫేజ్-1 పైపులైన్ విస్తరణ కారణంగా ఏప్రిల్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలోని పలుప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 1న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.
మీరాలం రిజర్వాయర్ ప్రాంతం, కిషన్బాగ్, అల్జుబైల్ కాలనీ, అలియాబాద్ ప్రాంతంతోపాటు బాలాపూర్ రిజర్వాయర్ ప్రాంతాల పరిధిలో 24 గంటలపాటు నీటి సరఫరా నిలిచిపోనుంది.
వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు కోరారు.