దుబాయ్ : భారత గ్రాండ్మాస్టర్ అరవింద్ దుబాయ్ ఓపెన్ చెస్ టోర్నీని గెలుచుకున్నాడు. అరవింద్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, టాప్ టెన్లో ఏడుగురు భారతీయులు చోటు దక్కించుకోవడం గమనార్హం. మరో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందం మరో అయిదుగురితో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ప్రజ్ఞానందతో జరిగిన చివరి, తొమ్మిదో రౌండ్ మ్యాచ్ను అరవింద్ డ్రాగా ముగించి విజేతగా నిలిచాడు.