గురుగ్రామ్: అరావలి కొండల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ డీఎస్పీ తన ప్రాణాలను కోల్పోయాడు. విధులు నిర్వహిస్తున్న తౌడు డీఎస్పీ సురేందర్ సింగ్ పై డంపర్ డ్రైవర్ తన వాహనాన్ని తీసుకువెళ్లాడు. పేపర్లు చెక్కింగ్ చేసేందుకు వాహనాన్ని అడ్డుకోగా.. దాని డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఇద్దరు పోలీసులతో తౌరు వెళ్లిన డీఎస్పీకి చేదు అనుభవం ఎదురైంది. అనుమానిత డంపింగ్ వాహనాన్ని గుర్తించి దాన్ని ఆపేందుకు డీఎస్పీ ప్రయత్నించారు. ఆ సమయంలో వాహనం డీఎస్పీని తాకింది. గాయపడ్డ డీఎస్పీని హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు తేల్చారు. నుహ్ జిల్లాలో అక్రమ మైనింగ్ ఎక్కువ. అక్కడ ప్రతి ఏడాది కనీసం 50 ఫిర్యాదులు అందుతున్నాయి.