ముంబై: క్రికెటర్ యజువేంద్ర చాహల్ ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఆడుతున్న అతను.. గతంలో తనకు ఎదురైన ఓ భయానక పరిస్థితి చెప్పుకొచ్చాడు. క్రికెట్ మైదానంలోనే కాదు, డ్రెస్సింగ్ రూమ్లోనూ సరదాగా ఉండే చాహల్.. 2013 సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. అయితే ఆ ఏడాది బెంగుళూరుతో మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన పార్టీలో ఏం జరిగిందో చెప్పాడు. అశ్విన్, కరణ్ నాయర్లతో వీడియో రూపొందించిన చాహెల్ .. అప్పటి ఘటన గురించి సంపూర్ణంగా వివరించాడు. తాను చెప్పబోయేది ఎవరికీ తెలియదని, 2013లో తాగిన ఓ ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్ తనను బెదిరించిన తీరు గురించి వెల్లడించాడు. ఫుల్గా తాగిన ఆ వ్యక్తి.. 15వ అంతస్తులో ఉన్న బాల్కనీ నుంచి తనను తోసివేసే ప్రయత్నం చేసినట్లు చెప్పాడు. అయితే వేలాడుతున్న సమయంలో తన చేతులతో ఆ ప్లేయర్ను పట్టుకున్నట్లు చాహల్ తెలిపాడు. అక్కడ పార్టీలో ఉన్న ప్లేయర్లు అంతా వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు చెప్పాడు. ఆ సమయంలో కొంత భయాందోళనకు గురయ్యానని, అక్కడ చిన్న పొరపాటు జరిగినా, పరిస్థితి దారుణంగా ఉండేదని, బయటకు వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అప్పుడు అర్థమైందని చాహల్ అన్నాడు.
Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV
— Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022