ముంబై: బంగారం స్మగ్లింగ్పై డైరక్టరేట్ ఆఫ్ రెవన్యూ ఇంటెలిజెన్స్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. తాజాగా 65.46 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ వెల్లడించింది. ముంబై, పాట్నా, ఢిల్లీలో సాగుతున్న స్మగ్లింగ్ దాందా ఆటకట్టించింది. విదేశాలకు చెందిన 394 గోల్డ్ బార్లను డీఆర్ఐ ఇటీవల పట్టుకున్నది. వాటి విలువ సుమారు 33.40 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు డీఆర్ఐ పేర్కొన్నది.