వరంగల్ చౌరస్తా, నవంబర్ 29: కదలని డిజిటల్ వాచ్మెన్లు సీసీ కెమెరాలని వరంగల్ పో లీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. సోమవా రం వరంగల్ ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ ఎదు ట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ఏర్పాటు చేసిన 108 సీసీ కెమె రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో మొదటి సెక్టార్లో 72, రెండో సెక్టార్లో 27, మరో తొమ్మి ది కెమెరాలను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశా మని పేర్కొన్నారు. ఎక్కువ రద్దీగా ఉండే ఈ ప్రాం తంలో ట్రాఫిక్ పోలీసులతో సమావేశాన్ని ఏర్పా టు చేసి ‘వన్ వీక్ వన్ సైడ్’ విధానాన్ని తిరిగి అ మలుచేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను పరి ష్కరిస్తామని తెలిపారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన చార్భౌళి టిఫిన్ సెంట ర్ రాజు, కూరగాయల మార్కెట్ కొత్తిమీర వ్యాపా రుల సంఘం అ ధ్యక్షుడు గోపి, మొబైల్ షాప్స్ అ సోసియేషన్ అధ్యక్షుడు రఫీ, టెక్నీషియన్ నూత న్తోపాటు సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, కానిస్టేబుల్ రాజశేఖ ర్ను సీపీ శాలు వాలతో సత్కరించారు. అనంత రం పోలీస్ స్టేషన్ను సందర్శించి పలు కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
కరీమాబాద్ ప్రాంతానికి చెందిన మదర్ థెరి సా మహిళా సమాఖ్య ప్రతినిధులు జక్కుల ప్రజ్ఞ, నల్లెల ప్రేమలత తమ బ్యాగును ఆటోలో మర్చి పోయామని, అందులో సంఘాలకు సంబంధించి న సుమారు రూ. రెండు లక్షలు ఉన్నాయని పోలీ సులను ఆశ్రయించారు. వెంటనే పరిశీలించాలని సీపీ ఆదేశించడంతో ఎస్సై స్వామి ఆధ్వర్యంలో సిబ్బంది శివ, నరేశ్ సీసీ కెమెరాలను పరిశీలించి సంబంధిత ఆటోను గుర్తించారు. డ్రైవర్కు ఫోన్ చేయగా, బ్యాగును పోలీసులకు అప్పగించాడు. దాన్ని ఏసీపీ గిరికుమార్ బాధితులకు అప్పగించా రు. నిమిషాల వ్యవధిలోనే బాధితులకు బ్యాగును అప్పగించడంతో స్టేషన్ సిబ్బందిని సీపీ తరుణ్ జోషి, డీపీసీ పుష్పారెడ్డి అభినందించారు.