HomeNewsDr Reddys Molnupiravir Tablets Come Affordable For Corona Treatment
డాక్టర్ రెడ్డీస్ మోల్ఫ్లూ పిల్ ధర రూ.35
కరోనా చికిత్సకు అనుమతి పొందిన మోల్నుపిరవిర్ గోలీని ‘మోల్ఫ్లూ’ పేరిట మార్కెట్లోకి తీసుకురానున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ వెల్లడించింది. ఒక్కో గోలీ ధరను రూ. 35గా నిర్ణయించినట్టు తెలిపింది. 10 గోలీలు ఉన్న స్ట్రిప్కు రూ. 350, 5 రోజుల కోర్సు కోసం 40 గోలీలకు రూ. 1,400 ధర నిర్ణయించినట్టు వివరించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన హోం-ఐసొలేషన్లోకి వెళ్లారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్లో ఉన్నవాళ్లు పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్ఎన్ఏ ఆధారిత థెరపీలు.. దాదాపు అన్ని వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తాయని అమెరికాలోని యెల్ స్కూల్ ఆఫ్ మెడిసన్ పరిశోధకులు తెలిపారు. ఈ జాబితాలో డెల్టా కూడా ఉన్నట్టు వెల్లడించారు. ఒమిక్రాన్ను గుర్తించక ముందే ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
డెల్టా కంటే 70 రెట్లు వేగంగా శరీరంలోని కణజాలాలకు వ్యాపిస్తున్న ఒమిక్రాన్.. ఊపిరితిత్తులకు పెద్దఎత్తున నష్టం కలిగించడం లేదని అమెరికా, జపాన్ పరిశోధకులు తెలిపారు. అందుకే దవాఖానల్లో చేరేవారి సంఖ్య తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. దీనికి కారణం ఊపిరితిత్తుల కణాలపై ఈ వేరియంట్ తీవ్రత తక్కువగా ఉన్నట్టు వెల్లడించారు.
ప్రతి 200 మంది వైరస్ బాధితుల్లో ఒక్కరికి మాత్రమే ఆక్సిజన్ అవసరం పడుతున్నదని దేశంలోని ప్రైవేటు దవాఖానలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్పీఐ) వెల్లడించింది.