న్యూఢిల్లీ, ఆగస్టు 18: బీజేపీ నేత సయ్యద్ షానవాజ్ హుస్సేన్పై లైంగికదాడి కేసు నమోదు చేయని ఢిల్లీ పోలీసులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై పోలీసులు అయిష్టంగా ఉన్నట్టు కనిపిస్తున్నదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘2018లోనే నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మెజిస్టీరియల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశించినప్పటికీ, పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అనిపించలేదు.
దీన్నిబట్టి చూస్తే ఎఫ్ఐఆర్ నమోదుకు వాళ్లు సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు’ అని ధర్మాసనం పేర్కొంది. నిందితుడు హుస్సేన్పై వెంటనే రేప్ కేసు నమోదు చేసి 3 నెలల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించేందుకు నిరాకరించింది. కూల్డ్రింక్లో మత్తుమందు కలిపిన హుస్సేన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించింది.