తిరుమల : టీటీడీ ( TTD ) శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.60 లక్షలు విరాళంగా ( Donations ) అందింది. బెంగుళూరుకు చెందిన కె.యన్. నయన, వి.ప్రభా, రాజేష్, కె.యన్.రాజేష్, గుంటూరుకు చెందిన దేవరశెట్టి రితీష్, దేవరశెట్టి సత్యనారాయణలు వేర్వేరుగా రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.
ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను చైర్మన్ అభినందించారు.