న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశీయంగా ప్యాసింజర్ కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది అమ్ముడైన 30.69 లక్షలతో పోలిస్తే 26.73 శాతం పెరిగినట్టు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించింది.
దీంతో 2018-19లో అమ్ముడైన 33,77, 436 యూనిట్లు రికార్డు స్థాయి తుడిచిపెట్టుకుపోయింది. గతేడాది అమ్ముడైన పీవీల్లో యుటిలిటీ వాహనాలు 20.03 లక్షలు ఉన్నాయని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. అలాగే 9,62,468 యూనిట్ల కమర్షియల్ వాహనాలు, 1,58,60,087 యూనిట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి.