న్యూఢిల్లీ, మార్చి 19: దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను 7 శాతం నుంచి 8 శాతం వరకు పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఆన్సైట్ స్టాఫ్ సిబ్బంది వేతనాలను 2-4 శాతం వరకు సవరిస్తున్నట్లు వెల్లడించింది.
అధిక పనితీరు కనబరిచిన సిబ్బంది వేతనాలను మాత్రం 12 శాతం నుంచి 15 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. పెరిగిన వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 6 శాతం నుంచి 9 శాతం వరకు సవరించిన సంస్థ ఈ సారి మాత్రం కొంతమేర తగ్గించింది.