న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ప్రజలను జైలుకు పంపించడం సరైన చర్య కాదని, విచక్షణతో చట్టాన్ని వినియోగిస్తూ దాని విలువను కాపాడాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు హితవు పలికింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం పేర్కొంది. లీజ్ అగ్రిమెంట్ను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో జార్ఖండ్కు చెందిన ఓ స్టీల్ కంపెనీపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే కోర్టు పై వాఖ్యలు చేసింది.