KU | హనుమకొండ చౌరస్తా: కాకతీయ యూనివర్సిటీ సెక్యూరిటీ ఏజెన్సీ (Security Agency)ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఇవ్వద్దు అని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ చాంబర్లో ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఏజెన్సీలకు కేయూ సెక్యూరిటీ ఏజెన్సీని అప్పగిస్తే పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని, అవసరమైతే యూనివర్సిటీ బంద్కు పిలుపిస్తామని వారు యూనివర్సిటీ అధికారులను హెచ్చరించారు. సెక్యూరిటీ ఏజెన్సీని తెలంగాణ ప్రాంతవాసులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కేయూ సెక్యూరిటీ ఏజెన్సీని తెలంగాణప్రాంత వాసులకే ఇస్తామని వైస్ చాన్స్లర్ (VC) హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో డెమొక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ర్ట కన్వీనర్ కామగోని శ్రావణ్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు కుమ్మరి శ్రీనాథ్ మాదిగ, స్వేరో స్టూడెంట్స్యూనియన్ ఎస్ఎస్యూ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ స్వేరో, నాయకులు ఉప్పుల శివ, చెట్టుపల్లి శివకుమార్, గుండా వంశీ, వివేక్ , జగదీష్ పాల్గొన్నారు.