పుదుచ్చేరి ;పుదుచ్చేరిలో విపక్ష ఎమ్మెల్యేలు శుక్రవారం వినూత్న నిరసన తెలిపారు. మెడలో ఐడీకార్డులు వేసుకొని, స్కూల్ బ్యాగులు భుజానికి తగిలించుకొని, సైకిళ్లపై అసెంబ్లీకి చేరుకున్నారు. విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా నేటికీ ప్రభుత్వం విద్యార్థులకు యూనిఫారాలు, పుస్తకాలు, ల్యాప్టాప్లు, సైకిళ్లు అందించకపోవడంపై మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిలదీసేందుకే విద్యార్థుల తరహాలో తాము అసెంబ్లీకి రావాల్సి వచ్చిందని ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు తెలిపారు. ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పనితీరు విద్యార్థుల పాలిటశాపంగా మారిందని విమర్శించారు. టీచర్ పోస్టులను సైతం సర్కారు సకాలంలో భర్తీచేయడం లేదని ఆరోపించారు.