వ్యవస్థ ఆధారంగా విభజన జరగనున్నది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తున్నది. సోమవారం మార్గదర్శకాలు విడుదల చేయగా.. మరుసటి రోజే షెడ్యూల్ జారీ చేసింది. అన్ని జిల్లాల్లోని ఉద్యోగుల సీనియార్టీ జాబితాను రూపొందించి ఆయా శాఖల కార్యదర్శులకు నివేదించారు. బుధవారం నుంచి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ నుంచి ఆప్షన్లు కూడా మొదలయ్యాయి. గతంలో రాష్ట్ర స్థాయి పోస్టులు చాలా ఉండటంతో ఇతరులకు నాన్ లోకల్ విధానంలో అధికంగా వచ్చేవి. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పోస్టులను మల్టీజోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం జోగుళాంబ జోన్ పరిధిలో ఉమ్మడి జిల్లా మాత్రమే ఉండటంతో ఇకపై మన పోస్టులు మనకే లభించనున్నాయి. ఏ జిల్లా ఉద్యోగులు ఆ జిల్లాల్లోనే కొనసాగవచ్చు. ఒకవేళ సంబంధిత పోస్టు ఆ జిల్లాలో ఖాళీ లేకపోతే వేరే జిల్లాకు ఆప్షన్ పెట్టుకునే వెసులుబాటు ఉన్నది. మల్టీజోన్ పరిధిలో జోగుళాంబ, చార్మినార్ జోన్ పరిధిలో మన యువతకు 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి.
మహబూబ్నగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యోగుల వి భజనకు సంబంధించిన కసరత్తు వేగంగా కొనసాగుతున్న ది. ఈ నెలాఖారుకల్లా విభజన ప్ర క్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల విభజనకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల నుంచి ఉద్యోగుల సీనియార్టీ జాబితాలను రూపొందించి, తమ శాఖల కార్యదర్శులకు పంపించారు. బుధవారం నుంచి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. ఇక జిల్లా ఉద్యోగులతో పాటే జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల విభజన, బదిలీలు చేపట్టాలని సూచించారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ ప్రా రంభం కావడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా భవిష్యత్లో చేపట్టే ని యామకాల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ల భించనున్నాయి. పోస్టుల పునర్వ్యవస్థీకరణతో ఉద్యోగులకు తమ సొంత జిల్లాలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆప్షన్లను ఉపయోగించుకోవడం ద్వారా ఇం దుకు వీలవుతుంది. ఒకవేళ పనిచేసే పోస్టు ఆ జి ల్లాలో ఖాళీ లేకపోతే.. వేరే జిల్లాకు ఆప్షన్ పెట్టుకోవ చ్చు. ఏదేని జిల్లాలో ఒక ప్రభుత్వ విభాగంలో అవసరానికి మించి పోస్టులు ఉంటే.. అందులో జూనియర్లను గుర్తించి వేరే చోటుకు బదిలీ చేస్తారు. ప్రస్తు తం జిల్లాల్లో ఉద్యోగులంతా ఆర్డర్ టు సర్వ్ విధానంలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని రద్దు చేయాలని గతంలో పలుమార్లు ఉద్యోగ సం ఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఎట్టకేలకు ప్రభుత్వం ఇన్ని నెలల తర్వాత ఈ ప్రక్రియను పూర్తి చేసింది. ప్రభుత్వం గతంలో ప్రకటించిన 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్కు మార్గం సుగమం అవ్వనున్నది.
జిల్లా పోస్టులతో ఎంతో లబ్ధి..
జిల్లా పోస్టులైన టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, డ్రై వర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, కానిస్టేబు ల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 తదితర పోస్టులన్నీ జిల్లా పోస్టులుగా నిర్ణయించారు. దీతో ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులకు వరంగా మారనున్నది. వెనుకబడిన జిల్లాల్లోని నిరుద్యోగులు ఇకపై తమ ఉద్యోగాలు తామే పొందగలిగే అవకాశం రానున్నది. ఏటా రాష్ట్ర ప్రభు త్వం భారీగా కానిస్టేబుల్, పంచాయతీ కార్యదర్శి త దితర పోస్టులు భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఇకపై ఏ జి ల్లా ఉద్యోగాలు ఆ జిల్లాకే దక్కనున్నాయి.
ఇక మన ఉద్యోగాలు మనకే..
కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టులను ప్రభుత్వం వర్గీకరించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆయా శాఖల్లోని పోస్టులను జిల్లా (లోకల్), జోనల్, మల్టీ జోన్ క్యాడర్ వారీగా గుర్తించింది. డిఫ్యూటీ కలెక్టర్, ఆర్డీవో, తాసిల్దార్, డీఎస్పీ, సీటీవో, డీఏవో, డీపీవో, ఎంపీడీవో, ఏవో, సబ్ రిజిస్ట్రార్ తదితర పోస్టులు సైతం మల్టీ జోనల్ పరిధిలోకి తీసుకురావడం వల్ల స్థానిక జోన్ల పరిధిలోని వారికే అవకాశాలు లభిస్తాయి. సమైక్య రాష్ట్రంలో ఉన్నత స్థాయి పోస్టులన్నీ రాష్ట్ర స్థాయిలో ఉండడంతో తెలంగాణేతరులు పెద్ద ఎత్తున మన ఉద్యోగాలను చేజిక్కించుకునేవారు. ప్రస్తుతం గెజిటెడ్ పోస్టులు సైతం మల్టీ జోన్ పరిధిలో ఉంచడంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అన్నింటా న్యాయం జరుగుతున్నది. ఇన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా నూతన జోనల్ విధానం ఖరారైంది. దీంతో కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 6 జోన్లు ఉండగా.. తెలంగాణ విభజన తర్వాత అప్పటికే ఉన్న రెండు జోన్లతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం జిల్లాల విభజన చేసింది. కొత్త జిల్లాల ప్రకారం జోన్లు, మల్టీ జోన్లు సిద్ధం చేసింది. వాటికి తగ్గట్లుగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల్లోని పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి వారీగా గుర్తించింది. గతంలో రాష్ట్ర స్థాయి పోస్టులు అధికంగా ఉండడం వల్ల ఇతర రాష్ర్టాల వారికి మన పోస్టులు నాన్ లోకల్ విధానంలో అధికంగా ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్ర స్థాయి పోస్టులను సైతం మల్టీ జోన్ పరిధిలోకి తీసుకురావడం వల్ల మన ఉద్యోగాలు మనకే దక్కేందుకు ఎక్కువ అవకాశం ఏర్పడిందని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.