హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగా ణ): అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులకు వేస వి సెలవుల్లో ఇబ్బందులు తలెత్తకుండా తగు చ ర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్యా దేవరాజన్ ఆదేశించారు. మే 1 నుంచి 15 వరకు అంగన్వాడీ టీచర్లకు, 16 నుంచి 30 వరకు అంగన్వాడీ సహాయకులకు సెలవుల కారణంగా ఆరోగ్యలక్ష్మి, బాలామృతం లబ్ధిదారులకు ఇబ్బందులు రాకుండా చూడాలని, టేక్హోం రేషన్ (ఇంటి కే రేషన్) పక్కాగా అమలు చేయాలని జిల్లా సంక్షేమ అధికారులు, సీడీపీవోకు సూచించారు. మినీ అంగన్వాడీ కేంద్రాలు, అంగన్వాడీ టీచర్, సహాయక పోస్టులు ఖాళీగా ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు.