సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ) : ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్లోని బంజారాభవన్లో ఏర్పాటు చేసిన సెక్టోరియల్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి పది నుంచి 12 పోలింగ్ స్టేషన్లకు ఒక సెక్టోరియల్ అధికారిని నియమించినట్లు రొనాల్డ్రాస్ చెప్పారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్లను మూడు సార్లు సందర్శించి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏఎంఎఫ్ (కనీస అవసరాల)లో భాగంగా దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంపులు, తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, ఇంటర్నెట్, సాకెట్స్, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి ముందు రోజే పోస్టల్ బ్యాలెట్
ఎన్నికల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి ముందు రోజే వారికి పోస్టల్ బ్యాలెట్ను అందించి అదే రోజు స్వీకరిస్తామని రొనాల్డ్రాస్ తెలిపారు. ఈ ఎన్నికల్లో మహిళా పోలింగ్ సిబ్బందికి పోలింగ్ రోజు ఉదయం 5 గంటలకు తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లో రిపోర్ట్ చేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిందని తెలిపారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలోని పోలింగ్ సిబ్బంది సమాచారాన్ని కలిగి ఉండాలని పేర్కొన్నారు. సెక్టోరియల్ అధికారులకు పోలింగ్కు వారం ముందు మెజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయని, తద్వారా ఎన్నికలకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రూట్ మ్యాప్ను రూపొందించుకొని సిద్ధంగా ఉండాలన్నారు.
నవంబర్ 10 తర్వాత ఓటరు స్లిప్లు..
నవంబర్ 10వ తేదీ తర్వాత బీఎల్ఓలు ఓటరు స్లిప్లను పంపిణీ చేస్తారని రొనాల్డ్రాస్ తెలిపారు. ఈ సారి కొత్తగా ఓటరు సంబంధిత సమాచారాన్ని స్టికర్స్ రూపంలో ప్రతి ఇంటికి అతికిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి సమస్య తలెత్తినా సెక్టోరియల్ అధికారులు సమస్యను పరిషరించాలని తెలిపారు. ఈవీఎంల పనితీరుపై ప్రిసైడింగ్ అధికారులు సెక్టోరియల్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈవీఎంల కమిషనింగ్పై త్వరలో అవగాహన కల్పిస్తామని ఆయన చెప్పారు. పోల్ రోజు ముందుగా మాక్ పోల్ నిర్వహించాలని, పోలింగ్ సమయం ముగిసిన అనంతరం క్యూలో నిలబడిన వారందరూ ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు మాక్ పోల్ రిపోర్ట్, ఓటరు టర్న్ అవుట్ రిపోర్ట్ ఇతర రిపోర్ట్లను ప్రిసైడింగ్ అధికారి సెక్టోరియల్ ఆఫీసర్కు అందించడం ద్వారా డీఈఓకు చేరుతుందని తెలిపారు.
రాజకీయ పార్టీ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ : ఆర్వో వెంకటచారి
సెక్టోరియల్ అధికారులకు ప్రీ పోల్, పోల్ ఈవ్, పోల్ డే రోజులలో తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్ డీఆర్వో, యాకత్పుర ఆర్వో వెంకటచారి సమగ్రంగా వివరించారు. ప్రీ పోల్లో భాగంగా వల్నరేబుల్ మ్యాపింగ్, ఓటరు అవేర్నెస్, కనీస వసతులపై చర్యలు తీసుకోవాలని, పోల్ ఈవ్లో భాగంగా రాజకీయ పార్టీల ఏజెంట్లు ఉండేలా, ఎలక్షన్ మెటీరియల్, సెక్యూరిటీ పర్సనల్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా, పోల్ డే రోజు రాజకీయ పార్టీ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాలని తెలిపారు. ఈవీఎం, వీవీ ప్యాట్ రీప్లేస్మెంట్, ఓటరు నమోదు శాతం, రిపోర్ట్లపై పనిచేయాల్సి ఉంటుందని వెంకటచారి పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో 1500 ఓటర్లకు మించిన వాటిని ఆగ్జలరి పోలింగ్ కేంద్రాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు దగ్గరలో పారింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి సంబంధిత ఆర్ఓ, బీఎల్ఓ ద్వారా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన ప్రచురించిన తుది ఓటరు జాబితాలో ఓటరు పేరు నమోదుతో పాటు సప్లిమెంటరీ ఓటరు లిస్ట్లో కూడా ఓటరు పేరు ఉన్నచో ఓటు హకుకు అర్హులని వెంకటచారి చెప్పారు. రాజకీయ పార్టీ ప్రతినిధుల వాహనాల పర్మీషన్, డీ ఫేస్మెంట్, ప్రీ బీస్ తదితర సమాచారాన్ని అధికారులు పరిశీలించాలని,పోలింగ్ రోజు ఎటువంటి ప్రచారం చేయకుండా ఎంసీసీ ద్వారా చర్యలు తీసుకోవాలి. ఈ సమావేశంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, ఆర్ఓ వెంకటేశ్ దోత్రె, అదనపు కమిషనర్ ఎలక్షన్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
50 ఓట్లతో మాక్ పోలింగ్ : డిప్యూటీ డీఈఓ అనుదీప్
సెక్టోరియల్ అధికారులు జిల్లా మిషనరీ, ఆర్ఓ, పోలింగ్ బూత్ సిబ్బందికి వారధి లాగా పనిచేస్తారని డిప్యూటీ డీఈఓ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పోలింగ్ రోజు గంట నుంచి గంటన్నర వ్యవధిలో పూర్తిగా సందర్శించే విధంగా ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సాంకేతిక సమస్య వచ్చినచో వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి సెక్టోరియల్ అధికారులు గైడ్ చేయాలని తెలిపారు. మాక్ పోలింగ్ సమయంలో 50 ఓట్లను ప్రతి ఒక అభ్యర్థికి, నోటాకు వేసేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంతకు ముందు జరిగిన శిక్షణ కార్యక్రమాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై అవగాహన కల్పించామని అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
పార్టీలకు పలు సూచనలు