హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు అంతర్జాతీయ పురస్కరించుకొని ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన మొత్తం 40 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డీ దివ్య సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 2021, 2022 కలిపి రెండేండ్లకుగాను మొత్తం 40 మందికి అవార్డుతోపాటు ప్రతి ఒక్కరికి రూ.లక్ష చొప్పున నగదుపురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ను దివ్య ఆదేశించారు.