బీజింగ్: వింటర్ ఒలింపిక్స్లో భారత్కు మరోసారి నిరాశ తప్పలేదు. బీజింగ్ వేదికగా జరుగుతున్న విశ్వక్రీడలకు ఎంపికైన ఏకైక భారత స్కీయర్ ఆరిఫ్ ఖాన్ బరిలోకి దిగిన రెండో ఈవెంట్లోనూ పరాజయం పాలయ్యాడు. ఆదివారం జెయింట్ స్లాలమ్ ఈవెంట్లో 45వ స్థానంలో నిలిచిన ఆరిఫ్.. బుధవారం పురుషుల స్లాలమ్ ఈవెంట్లో లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయాడు.