గువాహటి, ఫిబ్రవరి 11: బీజేపీ నేతల రాజకీయ చర్చ రోజురోజుకూ లోతుల్లోకి దిగజారిపోతున్నది. అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. 2016లో పాక్పై సర్జికల్ స్ట్రైక్ జరిగిందనడానికి సాక్ష్యం ఏదని అడిగిన రాహుల్ను ఆయన తీవ్ర పదజాలంతో విమర్శించారు. ‘రాహుల్ ఏ తండ్రికి జన్మించారో సాక్ష్యం కావాలని మేం అడిగామా’ అని శర్మ అన్నారు. జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్పై సైన్యం చెప్పిందే అంతిమం అని పేర్కొన్నారు.