అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప రాణించడంతో ఒక దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన చెన్నైని ముంబై బౌలర్లు అడ్డుకున్నారు. దీంతో చెన్నై విజయ సమీకరణం 18 బంతుల్లో 42 పరుగులకు చేరింది. ఉనాద్కట్ వేసిన 18వ ఓవర్లో ప్రిటోరియస్ ఓ సిక్సర్, ధోనీ ఓ ఫోర్ కొట్టడంతో 13 పరుగులు రాగా.. బుమ్రా వేసిన 19 ఓవర్లో ప్రిటోరియస్ రెండు ఫోర్లు సహా 11 పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్లో చెన్నై గెలుపునకు 17 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి ప్రిటోరియస్ ఔటయ్యాడు. ఈ దశలో ఇక చెన్నైకి ఇక కష్టమే అనకుంటే.. ధోనీ తనలోని అసలు సిసలు ఫినిషర్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. ఆశలే లేని స్థితి నుంచి జట్టుకు అలవోకగా విజయాన్నందించి తనను ఎందుకు వరల్డ్ బెస్ట్ ఫినిషర్ అంటారో నిరూపించాడు.