హైదరాబాద్: చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన యువ లిఫ్టర్ ధనావత్ గణేశ్ స్వర్ణ పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన పురుషుల 81 కిలోల విభాగంలో బరిలోకి దిగిన గణేశ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. స్నాచ్లో 123కిలోలు ఎత్తిన గణేశ్..క్లీన్ అండ్ జర్క్లో 158 కిలోలు లేపాడు. మొత్తంగా రెండు విభాగాలు కలిపి 281 కిలోలు ఎత్తిన ఈ యువ లిఫ్టర్ పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థి అయిన గణేశ్ ప్రస్తుతం సికింద్రాబాద్ పీజీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంకు చెందిన గణేశ్ అంచలంచెలుగా ఈ స్థాయికి చేరుకున్నాడు.