హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టెంపుల్ టూరిజం వెల్లివిరిసింది. కరోనా సమయంలోనూ సాధారణ పర్యాటక ప్రాంతాల్లో పోలిస్తే పుణ్యక్షేత్రాలు యాత్రికులతో కళకళలాడాయి. కొవిడ్ ముప్పులోనూ మొక్కులు చెల్లించుకొనేందుకే భక్తులు మొగ్గు చూపారు. తెలంగాణలో నిరుడు అన్ని జిల్లాలకు కలిపి 3.20 కోట్ల మంది పర్యాటకులు సందర్శనకు వచ్చారు.
పుణ్యక్షేత్రాలున్న జిల్లాల్లో 1.76 కోట్ల మంది పర్యటించారు. హైదరాబాద్తో పోలిస్తే సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన యాత్రికులే ఎక్కువగా ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరిన యాదగిరిగుట్ట, రాములోరు నడియాడిన భద్రాచలం, సరస్వతీదేవి నిలయమైన బాసర, ప్రముఖ డయాసిస్ చర్చి ఉన్న మెదక్ జిల్లాను లక్షల మంది దర్శించుకోవడం విశేషం.
కరోనా తీవ్రంగా ఉన్న 2020లోనూ ఆలయాలు లక్షల యాత్రికులతో కిటకిటలాడాయి. మూడేండ్లలో హరిత హోటళ్ల బుకింగ్స్ ఎక్కువయ్యాయి. రామప్ప, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో పర్యాటక, హరిత హోటళ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.
– ఉప్పల శ్రీనివాస్గుప్తా, టీఎస్టీడీసీ చైర్మన్