కతీల్: కర్నాటకలోని దుర్గాదేవి భక్తులు అగ్ని ఖేళి ఆడారు. వందల ఏండ్ల సంస్కృతిలో భాగంగా కతీల్ పట్టణంలోని దేవీ భక్తులు అగ్ని ఖేళి ఆడడం ఆచారం. రెండు వర్గాలుగా మారిన భక్తులు.. ఒకరిపై ఒకరు నిప్పును విసురుకుంటారు. కాషాయం దోతీలు కట్టుకుని, ఛాతిపై చొక్కాలు లేకుండానే భక్తులు అగ్ని ఖేళి ఆడుతారు. దుర్గాపరమేశ్వరి దేవి ఆరాధనలో భాగంగా, ఆ దేవిని శాంతింప చేయడానికి భక్తులు ఈ ఆటను ప్రదర్శిస్తారు. మంగుళూరుకు సమీపంలో ఉన్న గ్రామ ప్రజలు ఈ ఆటను ఆడుతుంటారు. దాదాపు 20 మీటర్ల దూరం నుంచి రెండు గ్రూపులు తమ చేతుల్లో ఉన్న కాలుతున్న తాటి మట్టల్ని ఒకరిపై ఒకరు విసిరేసుకుంటారు. నిప్పు వల్ల తీవ్ర స్థాయిలో గాయాలైన వారికి అమ్మవారి కుంకుమ పూస్తారు. అగ్నిఖేళి ఆటను ప్రతి ఏడాది ఏప్రిల్లో నిర్వహిస్తారు. ఈ యేటి వీడియోను మీరూ చూడండి.
#WATCH | Devotees hurled fire at each other as part of a fire ritual 'Thoothedhara' or ‘Agni Kheli’ to pay reverence to goddess Durga at Sri Durgaparameshwari temple in Kateel, Karnataka (22.04) pic.twitter.com/q4SHMFAGak
— ANI (@ANI) April 23, 2022