మణికొండ, జోన్ బృందం ఫిబ్రవరి 17 : బంగారు తెలంగాణ సాధకుడు సీఎం కేసీఆర్కు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని మణికొండ, నార్సింగి, బండ్లగూడ, శంషాబాద్ మున్సిపాలిటీలతో పాటు రాజేంద్రనగర్ పట్టణ పరిధిలోని ఐదు డివిజన్లు, శంషాబాద్ మండల పరిధిలో అన్నదానం, పేదలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అన్నారు.