శేరిలింగంపల్లి, జనవరి 23: రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో సాగాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని టీ హబ్లో టీటా (తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్) సిసోజియమ్-2022 పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులతో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందిందంటే ఏ వ్యక్తి గొప్పతనం కాదని, కొన్ని రాజకీయ పార్టీలు తమ వల్లే అభివృద్ధి చెందిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 1960లోనే ఎంతో మంది ఇంజనీర్లు తెలంగాణ నుంచి అమెరికా వంటి దేశాలకు వెళ్ళి ఐటీ రంగంలో గుర్తింపు పొందినట్లు తెలిపారు. కర్ణాటక, హైదరాబాద్లు దేశంలోనే ఐటీ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నాయన్నారు.
ఐటీ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనమే సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో పరిస్థితులకు అనుగుణంగా వరల్డ్ లుకౌట్తో మంత్రి కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉండటం మన అదృష్టమని అన్నారు. విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిపై ప్రతి ఒక్కరికి నమ్మకం, గౌరవం ఉండటం సహజమేనని అన్నారు. అహంకారం లేకుండా సంస్కారంతో కూడిన జ్ఞానాన్ని పంచగలిగే వ్యక్తులను తయారు చేయాలని టీటా నిర్వాహకులకు ఆయన సూచించారు. టీటా సిసోజియస్కు ఆన్లైన్లో 33 దేశాల నుంచి 40 మంది పాల్గొననున్నట్లు టీటా అధ్యక్షుడు సందీప్ మక్తాల చెప్పారు. టీటాలో 20 వేల మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. 130 కళాశాలల నుంచి విద్యార్థులకు సభ్యత్వం కల్పించామని ఆయన అన్నారు. వ్యవసాయం, డిజిటల్ గావ్, కొవిడ్ దవాఖాన, సైబర్, కల్చరల్, హెల్త్ కేర్, స్పోర్ట్స్, టూరిజం వంటి అంశాలతో టీటా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్, టీటా ఉపాధ్యక్షుడు రాణా ప్రతాప్, ఫీనిక్స్ డైరెక్టర్ శ్రీకాంత్ బడిగాలు పాల్గొన్నారు.