చేగుంట/ హవేళీఘనపూర్, సెప్టెంబర్ 2 : టీఆర్ఎస్ ప్రభుత్వహయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నదని నార్సింగి ఎం పీపీ చిందం సబిత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, వల్లూర్ సర్పంచ్ ఆనందాస్ మహేశ్వరి పేర్కొన్నారు. మండలంలోని వల్లూర్ గ్రామంలో రూ.7లక్షల పంచాయతీ నిధులతో చేపట్టిన సీసీరోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములు, వార్డు సభ్యులు సుజాత, దొడ్ల పెంటయ్య, మాసమ్మగారి సుగుణ, రమేశ్, నాయకులు నాయకులు ఆనందాస్ నరేశ్, చిందం రవీందర్, అంబరీష, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
హవేళీఘనపూర్ : సుల్తాన్పూర్లో పనులు ప్రారంభిస్తున్న సర్పంచ్
సీఎం కేసీఆర్ కృషితోనే తండాల్లో అభివృద్ధి
హవేళీఘనపూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో రూ.10 లక్షల పంచాయతీ నిధులతో నిర్మిస్తున్న వివిధ పనులను సర్పంచ్ రమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితోనే తండాలు పంచా యతీలుగా ఏర్పడి, అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు.