లఖింపూర్ ఖీరీ (యూపీ): లఖింపూర్ ఖీరీ కేసులో అరెస్టు అయిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు డెంగ్యూ సోకింది. దీంతో అతడిని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ నెల 3న కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి ఆశిష్ కాన్వాయ్ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన విషయం తెలిసిందే. అనంతర ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మంది అరెస్టయ్యారు.