న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 11, 12 తరగతుల చరిత్ర సిలబస్ నుంచి ఈ ఏడాది కీలక పాఠాలను తొలగించింది. ప్రజాస్వామ్యం, భారత్లో మొఘల్ పాలన, అలీన ఉద్యమం, ప్రచ్ఛన్న యుద్ధం, పారిశ్రామిక విప్లవం తదితర పాఠాలను తొలగించినట్టు ప్రకటించింది.
పదో తరగతి సిలబస్ నుంచి వ్యవసాయంపై ప్రపంచీకరణ ప్రభావం, ఆహార భద్రత పాఠాలతోపాటు మతోన్మాదం, లౌకిక రాజ్యం, రాజకీయ భావనలు వివరించే ఉర్దూ కవి ఫైయాజ్ అహ్మద్ ఫైయాజ్ కవితలను కూడా తొలగించింది. సిలబస్ రేషనలైజేషన్లో భాగంగా ఎన్సీఈఆర్టీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సీబీఎస్ఈ తెలిపింది. 2022-23 విద్యా సంవత్సరానికి బోర్డు పరీక్ష ఒకే దఫాలో ఉంటుందని, గత ఏడాది మాదిరిగా రెండుసార్లు నిర్వహించబోమని స్పష్టంచేశారు.