న్యూఢిల్లీ, డిసెంబర్ 20: జమ్ముకు అదనంగా ఆరు అసెంబ్లీ సీట్లు, కశ్మీర్కు ఒక సీటు కేటాయించాలని పునర్విభజన కమిషన్ సిఫారసు చేసింది. 16 స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయాలని సూచించింది. కశ్మీర్ లోయలో ఒక నియోజకవర్గం మాత్రమే పెంచాలన్న సిఫారసును నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జేకే అప్నా పార్టీలు తప్పుబట్టాయి. బీజేపీ రాజకీయ ఎజెండాకు అనుగుణంగానే కమిషన్ ప్రతిపాదనలు చేసిందని విమర్శించాయి. ఇది ఆమోదనీయం కాదని, 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతిపాదనలు లేవని ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.