హైదరాబాద్ : ఆరు నెలల క్రితం వరకు తీవ్రమైన మోకాలునొప్పితో బాధపడుతు ఉండేవారు. 67 ఏండ్ల మీనాక్షి సెహగల్. ఎడమ మోకాలు వద్ద ఆర్థరైటిస్ కారణంగా అడుగుతీసి అడుగు వేయలేకపోయేవారు. అలాంటి పరిస్థితిని కొన్ని సంవత్సరాల పాటు అనుభవించారు. చివరకు హైదరాబాద్లో ఆమెకు అద్భుతమైన చికిత్స లభించింది. రీజెన్ ఆర్థోస్పోర్ట్ క్లినిక్కు చెందిన డాక్టర్ వెంకటేశ్ మొవ్వా ఆమెకు ఈ చికిత్స చేశారు. ఆ తర్వాత.. ఇప్పుడు సముద్రమట్టానికి 14వేల అడుగుల ఎత్తున ఉన్న కొండలు కూడా ఎక్కేస్తున్నారు!! తన సమస్య ఏంటో, దానికి పరిష్కారం ఎలా లభించిందో నోయిడాకు చెందిన మీనాక్షి సెహగల్ నమస్తే తెలంగాణకు వివరించారు.
ఇక్కడకు రావడానికి ముందుగా నేను ఒకసారి డాక్టర్ వెంకటేశ్ మొవ్వాతో ఫోన్లో మాట్లాడాను. అప్పుడే ఆయన ఈ చికిత్స గురించి చెప్పారు. హైదరాబాద్ వచ్చి ఆయనను కలిశాను. ఆ కన్సల్టేషన్ నా జీవితంలో గణనీయమైన మార్పులకు కారణమైంది. మొదట క్లినిక్లో మూడు రోజుల చికిత్స మొదలైంది. ఆ తర్వాత మూడు నుంచి నాలుగు వారాల పాటు పూర్తిస్థాయి చికిత్స, వ్యాయామాలు, తీసుకోవాల్సిన ఆహారం.. వీటన్నింటినీ నిపుణులైన ఫిజియోథెరపిస్టు వివరించారు. నాకు కొంత మార్పు కనిపించింది. మూడు నెలల తర్వాత మొదటి బూస్టర్ డోసు ఇచ్చారు. అది తీసుకున్నాక నార్వే అడవులు, నిటారు కొండలు, నిలువెత్తు గుట్టలు.. ఇలా గతంలో ఎప్పుడూ కనీసం ఆలోచన కూడా చేయలేని ప్రదేశాలకు వెళ్లగలిగాను.
రెండో బూస్టర్ డోసు తీసుకున్నాక నేను పెరూ దేశానికి వెళ్లాను. అక్కడ మచు పిచ్చు, కజ్కో, పునో, ఐకా లాంటి ప్రదేశాలకు వెళ్లాను. ఇవన్నీ సముద్రమట్టానికి 12,500 నుంచి 14వేల అడుగుల ఎత్తున ఉంటాయి. నా మోకాలినొప్పి 95% తగ్గిపోయింది. దీనివల్ల నాకు జీవితంలో సరికొత్త స్వేచ్ఛ, సంతోషం లభించాయి. నొప్పులు ఉన్నవాళ్లు రీజెన్ ఆర్థోస్పోర్ట్ ఆస్పత్రికి వచ్చి ఇక్కడ మూలకణ చికిత్స తీసుకుంటే ఇక ఆపరేషన్ అవసరం దాదాపుగా ఉండకపోవచ్చు” అని మీనాక్షి సెహగల్ తెలిపారు.
కాలినొప్పి తర్వాత కూడా సరికొత్త జీవితం సాధ్యం: డాక్టర్ వెంకటేశ్ మొవ్వా
“మీనాక్షి సెహగల్కు మోకాలిలోని మినిస్కస్ దెబ్బతింది. దానివల్ల ఆమె ఇబ్బంది పడేవారు. ఆమె సొంత మూలకణాలను మేం సేకరించి, పాడైన ప్రాంతంలోకి ఇంజెక్ట్ చేశాం. దానివల్ల వాటిని పునరుద్ధరించగలిగాం. ఫిజియోథెరపీ తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారు. సాధారణంగా కొంత పెద్ద వయసు వచ్చిన తర్వాత మోకాలు అరిగిపోతుందని, ఏమీ చేయలేమని వదిలేస్తారు. క్రమంగా పనులన్నీ మానుకుంటారు. దానివల్ల బరువు పెరుగుతారు. కానీ మోకాలు పూర్తిగా పాడయ్యేలోపు దాన్ని బాగుచేస్తే కొత్త జీవితాన్ని మొదలుపెట్టవచ్చు. అందుకు మీనాక్షి సెహగల్ జీవితమే నిదర్శనం” అని డాక్టర్ వెంకటేశ్ మొవ్వా చెప్పుకోచ్చాడు.