న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న మోసాలతో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. మోసగాళ్లు మాత్రం ఎప్పటికప్పుడూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఏదో ఒకరకంగా జనం నెత్తిలో కుచ్చుటోపీ పెడుతున్నారు. గత కొంత కాలంగా దేశ రాజధాని ఢిల్లీలో సీబీఐ అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్ను అక్కడి పోలీసులు ( Delhi Police ) అరెస్ట్ చేశారు. గ్యాంగ్లో మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నారని, వారిది ఇరానీ గ్యాంగ్ అని పోలీసులు తెలిపారు.
ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు చెప్పారు. వారి నుంచి మూడు బంగారు గొలుసులు, 8 మొబైల్ ఫోన్లు, రెండు టార్చీ లైట్లు, ఐదు నకిలీ ఐడెంటిటీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.