న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో నీతి ఆయోగ్(NITI Ayog) సమావేశం జరగనున్నది. ఆ సమావేశానికి వెళ్లడం లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. నీతి ఆయోగ్ మీటింగ్ను బహిష్కరిస్తున్నట్లు ఆయన ఓ లేఖలో తెలిపారు. సుప్రీం ఆదేశాలకు కట్టుబడి ప్రధాని వ్యవహరించడం లేదని, అలాంటప్పుడు సాధారణ ప్రజలు న్యాయం కోసం ఎక్కడికి వెళ్తారని కేజ్రీ తన లేఖలో ప్రశ్నించారు. సహకార సమాఖ్యకు విలువ లేనప్పుడు, నీతి ఆయోగ్ మీటింగ్కు హాజరుకావడం జోకే అవుతుందని ఆయన అన్నారు.