న్యూఢిల్లీ: సిక్కు వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు ఢిల్లీ అసెంబ్లీకి చెందిన శాంతి, సామరస్య కమిటీ సమన్లు జారీ చేసింది. సిక్కు వర్గానికి చెందినవాళ్లు ఖలిస్థాన్ ఉగ్రవాదులు అనే అర్థం వచ్చేలా ఇటీవల కంగన తన ఇన్స్టాగ్రాం ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను ఉద్దేశించి ఆమె ఈ పోస్ట్ చేశారు. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో కమిటీ సమన్లు జారీ చేసింది. వచ్చేనెల 6న కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కంగనను ఆదేశించింది.