కుతుబ్షాహీల పరిపాలన కాలంలో గోల్కొండ రాజ్యంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. వ్యవసాయ శిస్తు ప్రధాన ఆదాయవనరు. వజ్రాల గనుల నుంచి కూడా ఆదాయం వచ్చేది. గోల్కొండ రాజ్యం అత్యంత సంపన్నమైనది. స్థానిక ప్రజల సంప్రదాయాలను గౌరవించిన కుతుబ్షాహీలు వాస్తు కళాభిమానులు. వీరు అనేక కట్టడాలను నిర్మించారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేశారు.
కుతుబ్షాహీలు తమ పాలనాకాలంలో రాష్ట్రాలను తరఫ్ లేదా సిమ్త్లుగా విభజిం చారు. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో 6 తరఫ్లు ఉండేవి. అబ్దుల్లా తానీషా కాలంలో మొత్తం 37 సర్కారులు 517 పరగణాలు ఉండేవని డచ్ కంపెనీ రికార్డుల వల్ల తెలుస్తుంది. రేవు పట్టణంలో ఉన్నతాధి కారిని షాబందర్ అనేవారు. భూమి శిస్తు వసూలు అధికారాన్ని వేలం పాటలో అందరికంటే ఎక్కువ డబ్బు చెల్లించేవారికే ఇచ్చేవారు. ఈ రకమైన హక్కులను కొన్నవారిని ముస్తజీర్లు అనేవారు. ముస్తజీర్లుగా హిందువులనే ఎక్కువ సంఖ్యలో నియమించారు. మచిలీపట్నం వార్షిక ఆదాయం ఒక లక్ష ఎనబైవేల పగోడాలు. దీనిలో ఐదువేల పగోడాలను సుల్తాన్ హవల్దార్ జీతంగా చెల్లించేవాడు. మూడు వేలు హవల్దార్ తన కింది ఉద్యోగులకు చెల్లింపుల కోసం తీసుకున్నాడు.
రెవెన్యూ విధానం
వ్యవసాయం నీటిపారుదల సౌకర్యాలు
కుతుబ్షాహీ సుల్తానులు, వారి అధికారులు రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో వ్యవసాయాన్ని పోత్సహించారు. తెలంగాణ ప్రాంతంలో పాత చెరువులకు, మరమ్మతులు చేయించారు. కొత్త బావులను, చెరువులను నిర్మించి కాకతీయుల కాలం నాటి చెరువులకు ఊపిరి పోశారు. ఇబ్రహీం కులీ కుతుబ్షాహీ కాలంలో అనేక కొత్త జలాశయాలు, చెరువులు నిర్మించబడ్డాయి. వీటిలో హుస్సేన్సాగర్, బుద్వేల్, ఇబ్రహీంపట్నం చెరువు మొదలైనవి ప్రసిద్ధమైనవి. గోల్కొండ కోటలోని నీటి అవసరాల కోసం కోటకు 5 కి.మీ. దూరంలో దుర్గ్ వద్ద ఒక జలాశయాన్ని నిర్మించారు. కుతుబ్షాహీలు గ్రామస్థాయి నుంచి తరఫ్ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో చెరువుల పరిరక్షణకు అధికారులను, ఉద్యోగులను నియమించారు. దేవాలయాలు, మసీదులు, గ్రామసభలు కూడా చెరువుల నిర్మాణానికి, పునరుద్ధరణలో క్రియాశీలక ప్రాత నిర్వహించేవి.
పరిశ్రమలు
సమకాలీన తెలుగు రచనలు, కుతుబ్షాహీల ఫర్మానాల్లో గోల్కొండ రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు గురించి ప్రస్తావించాయి. వజ్రాలు, నేత, కలంకారీ అద్దకం, తివాచీ, నౌక నిర్మాణం, సురేకారం, ఇనుము-ఉక్కు మొదలైన పరిశ్రమల గురించి పేర్కొన్నాయి. ఈ పరిశ్రమల్లో పనిచేసే వారు వ్యవసాయరంగంతో పోలిస్తే చాలా తక్కువ మందికే ఉద్యోగావకాశాలు కల్పించారు.
వజ్రాల గనులు
గోల్కొండ గనుల్లో తవ్వి, శుద్ధిచేసిన వజ్రాలకు భారతదేశంలోనేకాక యావత్ ప్రపంచంలోనే విశేష గుర్తింపు ఉంది. కుతుబ్షాహీల రాజ్యంలో కృష్ణానదీతీరాన ఉన్న కొల్లూర్, కర్నూల్లోని రామళ్ళకోట వజ్రాలగని మేలు రకం వజ్రాలకు నిలయాలు. ఈ రెండు గనులు కుతుబ్షాహీల రాజ్యస్థాపనకు ముందే ఉన్నాయి. కోహినూర్ వజ్రం కొల్లూర్ గనిలో దొరికింది. వజ్రపుగనుల నుంచి లక్షల పగోడాల్లో ఆదాయం సుల్తాన్కు వచ్చేది.