న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు 4 శాతం డీఏను పెంచినట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం చెప్పినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడైంది. కరువు భత్యం పెంపుతో సుమారు 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. మరో 68.62 లక్షల మంది పెన్షర్లకు కూడా బెనిఫిట్ జరగనున్నది. సాధారణంగా డీఏను జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేస్తారు. అయితే కొత్త జీతాలతో పాటు ఎరియర్లను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో డీఏను మూడు శాతం పెంచిన విషయం తెలిసిందే.