వరంగల్ చౌరస్తా: సమాజానికి చెడు చేసే మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత అన్నారు. బుధవారం ప్రజాపాలన -ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా మట్టెవాడ పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎంహెచ్ డీ – అడిక్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సామాజిక అవగాహణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరై మత్తు పదార్ధాలకు బానిసలుగా మారి చికిత్స పొందుతున్న వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్తు మానవ శరీరాన్ని నిర్వీర్యం చేస్తుందని, సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అన్నారు.
మత్తుకు బానిసలుగా మారుతున్న వారు, మత్తును అలవాటు పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు. దీనిని నివారించడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు. సమాజంపై ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించిన నాడు ఇలాంటి వాటిని నివారించడం సులభతరం అవుతుందని అన్నారు. మత్తును వీడాలని అనుకునే వారు డీ అడిక్షన్ సెంటర్లను ఆశ్రయించడం ద్వారా శాస్త్రీయంగా, శాశ్వతంగా మత్తుకు దూరంగా ఉండడానికి వీలు కలుగుతుందని చెప్పారు.
అనంతరం ఎంజీఎంహెచ్ ఆవరణలో మొక్కలు నాటారు. ఎంజీఎం వైద్యాధికారి డాక్టర్ అశ్విన్, ఈగిల్ ఫోర్స్ ఏసీపీ రమేష్, మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్రావు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, ఈగిల్ ఫోర్స్ సిబ్బంది, తదితరులు