ముంబై, సెప్టెంబర్ 1: ముంబై పేలుళ్ల కీలక నిందితుడు, అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిపినవారికి రూ.25 లక్షల నగదు బహుమతిని అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రకటించింది. అతడి సన్నిహితులైన షకీల్ షేక్ అలియాస్ చోటా షకీల్ ఆచూకీ తెలిపితే రూ.20 లక్షలు, హాజీ అనీస్ అలియాస్ అనీస్ ఇబ్రహీం షేక్, జావెద్ పటేల్ అలియాస్ జావెద్ చిక్నా, ఇబ్రహీం ముస్తాఖ్ అబ్దుల్ రజాక్ మెమన్ అలియాస్ టైగర్ మెమన్ల సమాచారం చెప్పితే రూ.15 లక్షల చొప్పున అందజేస్తామని వెల్లడించింది. వీరంతా 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితులని పేర్కొంది.