కాప్రా, ఏప్రిల్ 8 : సైనిక్పురిలోని జీహెచ్ఎంసీ పార్క్ ఆహ్లాదానికి కేరాఫ్గా నిలుస్తున్నది. అయితే చిల్డ్రన్స్పార్కులో ఏర్పాటు చేసిన ఆటవస్తువులు, నిచ్చెనలు, జారుడు బల్లలు మాత్రం శిథిలావస్థకు చేరాయి. జారుడు బల్లపై నుంచి జారుతూ, ఊయలలు ఊగుతూ కేరింతలు కొట్టే చిన్నారుల సందడి సందర్శకులకు కనువిందు చేస్తుంది. అయితే ఈ ఆటపరికరాలు ఇటీవల బాగా దెబ్బతినడం చిన్నారులను, వారి తల్లిదండ్రులను ఆవేదనకు గురి చేస్తోంది.
సైనిక్పురి జీహెచ్ఎంసీ పార్కులో చిల్డ్రన్స్ ప్లేజోన్ లోని ఆటపరికరాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉత్సాహంగా జారుడు బల్ల ఎక్కి జారుతూ సంతోషాన్ని పొందే వారికి జారుడు బల్లకు దిగువన ఏర్పడిన వెడల్పాటి రంధ్రం వల్ల వారు కిందకు దిగాల్సింది పోయి రంధ్రంలోకి జారిపోయి మట్టిలోపడిపోతున్నారు. దీంతో వారు గాయాల పాలవుతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సైనిక్పురి చిల్డ్రన్స్పార్కులో చిన్నారులకు ఎంతో సంతాషా న్ని ఇచ్చే జారుడు బల్లతో పాటు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి. దీంతో వారు కిందపడి దెబ్బలు తలిగించుకొంటున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే వాటికి మరమ్మతులు చేపట్టాలి.
-సంజీవరెడ్డి, కాప్రాకాలనీల అధ్యక్షుడు
సైనిక్పురిపార్కులో చిల్డ్రన్స్ జోన్లో దెబ్బతిన్న ఆటపరికరాలు, జారుడు బల్లల మరమ్మతులకు, అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేయడం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాం. మంజూరైన వెంటనే వాటికి మరమ్మతు పనులు చేపడతాం.
– ఏ. నర్సింరావు, మేనేజర్, హార్టికల్చర్