మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి నది తీరంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం పద్మల్పురి కాకో ఆలయంలో దండారీ ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర కిన్వట్ జిల్లా జవార్ల, ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం అట్నగడ, జైనూర్ మండలం బూసిమెట్ల, సిర్పూర్(యూ) మండలం దోబా నుంచేగాక ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన గిరిజనులు, మహిళలు సుమారు 500 మందికిపైగా ఆలయానికి చేరుకొని సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా గుస్సాడీ నృత్యాలు చేశారు. – దండేపల్లి