సీఎం నిర్ణయంపై సర్వత్రా హర్షం
కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని, సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరుపుకొన్నారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక సంపత్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లిలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు దళితులు పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బండపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గుంటిరాములు, మాజీ వైస్ ఎంపీపీ రజనీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.