హైదరాబాద్ : కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్, బుధవారం సాయంత్రం 4:15 గంటలకు లోక్ భవన్లో కర్నాటక రాష్ట్ర 34వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డీకేతో గవర్నర్ థాపర్ చంద్ గెహ్లాత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, తదితరులు హాజరయ్యారు. డీకే శివకుమార్తో పాటు తొలి విడతలో 13 మంది క్యాబినెట్ మంత్రుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
జి. పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ నిర్ణయించగా ఈ జాబితాలోని ఇతర పేర్లలో యతీంద్ర సిద్ధరామయ్య, యు.టి. ఖాదర్, ఎం.బి. పాటిల్, కె.జె. జార్జ్, కె.హెచ్. మునియప్ప, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడ, ప్రియాంక్ ఖర్గే, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేష్ మరియు శరణ్ ప్రకాష్ పాటిల్ ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు.
కర్ణాటక నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ https://t.co/3RMeXrkKFR pic.twitter.com/68EzhuMz9e
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026