బెంగళూరు: కర్ణాటకలో ఏసీబీ సోదాల్లో ఓ జూనియర్ ఇంజినీర్ ఇంటి బాత్రూమ్ డ్రైనేజ్ పైపుల్లో దాచిన రూ.13.50 లక్షలు, సీలింగ్లో రూ.15 లక్షలు బయటపడ్డాయి. బుధవారం ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 68 చోట్ల తనిఖీలు నిర్వహించారు. కలబుర్గిలో జూనియర్ ఇంజినీర్ శాంత గౌడ ఇంటికి వెళ్లిన అధికారులు పావుగంట పాటు తలుపుకొట్టినా తెరవలేదు. ఆ సమయంలో శాంత గౌడ తన కొడుకుతో కలిసి బాత్రూమ్ వాష్ బేసిన్ ఔట్లెట్లో, సీలింగ్లో నోట్ల కట్టలను దాచేశారు. ఆ విషయం తెలుసుకొన్న ఏసీబీ అధికారులు వాటిని బయటకు తీశారు.