వ్యవసాయ యూనివర్సిటీ, మే 14 : భవిష్యత్తు అంతా వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకే ప్రాధాన్యం ఉంటుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సాగు వైపే మనందరి నడక కొనసాగాలని, దేశ గౌరవాన్ని పెంచేది అదేనని చెప్పారు. సాగువిద్యలో పట్టాపొంది దేశానికి అన్నంపెట్టే రైతన్నకు అండగా ఉండటమే వరంగా భావించాలని వెంకయ్యనాయుడు అన్నారు.
శనివారం రాజేంద్ర నగర్లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా నిర్వాహణ సంస్థ (నార్మ్) పోస్టు గ్రాడుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్ (అగ్రిబిజినెస్ ) కోర్స్ పూర్తిచేసిన విద్యార్థులకు పట్టా సర్టిఫికెట్లను అందజేసే చేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జినోమిక్స్, మల్టీఫ్లోరల్ బ్రీడింగ్, నానో టెక్నాలజీ తదితర రంగాలపై దృష్టి సారించాలన్నారు.
డ్రోన్స్, కృత్రిమమేధ వంటి అధునాతన సాంకేతికాలను కూడా సాగుకు చేరువ చేయడంలో ఐసీఏఆర్ మరింత కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్-ఎన్ఏఏఆర్ఎం హెడ్ రంజిత్కుమార్ , ఐసీఏఆర్ డీజీ, డీఏఆర్ కార్యదర్శి మహాపాత్ర, సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్రావు, వెంకటేశ్వర్లు, గణేశ్ కుమార్, వ్యవసాయరంగ నిపుణులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.