ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్ధశతకంతో అదరగొట్టిన కాన్వేతో పాటు రుతురాజ్ గైక్వాడ్ (41) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడుతుండటంతో 11 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు 110 పరుగులు చేసింది. అయితే 11వ ఓవర్ చివరి బంతికి రుతురాజ్ అవుటయ్యాడు.
నోర్ట్జీ వేసిన బౌన్సర్ను పుల్ చేయబోయిన రుతురాజ్.. టైమింగ్ మిస్ అయ్యాడు. దాంతో గాల్లోకి లేచిన బంతికి మిడ్ వికెట్లో ఉన్న అక్షర్ పటేల్ సునాయాసంగా అందుకున్నాడు. దీంతో రుతురాజ్ నిరాశగా మైదానం వీడాడు. ఢిల్లీ జట్టుకు తొలి వికెట్ దక్కింది.