హైదరాబాద్ : జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్(BC Commission Chairman) హన్సరాజ్ గంగారామ్ అహిర్ ను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanthi Kumari), డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) మర్యాద పూర్వకంగా కలిశారు. ఒకరోజు పర్యటన సందర్భంగా హైదరాబాద్ కు వచ్చిన చైర్మన్ను హరితా ప్లాజా లో కలసి తెలంగాణా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అమలవుతున్న పలు అభివృద్ధి(Development), సంక్షేమ పథకాలను, ఓబీసీలకు రిజర్వేషన్లు (Reservations), రిజర్వేషన్ రోస్టర్ అమలును సీఎస్ శాంతి కుమారి వివరించారు.
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘ షీ టీమ్స్’ (She Teams)పోలీసు విభాగం చేపట్టిన వివిధ కార్యక్రమాలు డీజీపీ వివరించారు.అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యులు టి. ఆచారి, సలహాదారు రాజేష్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ అలోక్ కుమార్ ఇతర అధికారులు,బీసీ కమిషన్ చైర్మన్ను మద్యాద పూర్వకంగా కలిశారు.