బరేలీ, ఏప్రిల్ 7: ప్రశ్నించిన వారిపై ఇప్పటిదాకా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న బీజేపీ సర్కారు.. ఇప్పుడు ఆస్తుల విధ్వంసానికీ పాల్పడుతున్నది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను విమర్శించారని ఎస్పీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం అన్సారీకి చెందిన పెట్రోల్ బంకును అధికారులు బుల్డోజర్తో కూల్చేశారు. దాన్ని చట్టవిరుద్ధంగా నిర్మించారని అధికారులు చెప్తున్నారు. దీనిపై ఇప్పటికే నోటీసులు ఇచ్చినా స్పందన లేదని, అందుకే కూల్చివేసినట్టు తెలిపారు.