హైదరాబాద్: ఆరేండ్ల చిన్నారిని హత్య చేసిన కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. మంగళవారం కేసుకు సంబంధించిన పురోగతిపై నగర సీపీ అంజనీకుమార్ సమీక్షించారు. అదనపు డీజీ శిఖాగోయల్, సంయుక్త సీపీ రమేశ్రెడ్డి, టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తితో కలిసి పలు విషయాలపై చర్చించారు. పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు విస్త్రృతంగా గాలిస్తున్నట్లు తెలిపారు.